బాబరీ కేసుపై 30 న తుది తీర్పు
Rajahmundry:బాబ్రీ కట్టడం కూల్చివేత కేసుపై సెప్టెంబర్ 30న ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ తీర్పును ప్రకటించనున్నారు. తీర్పును వినేందుకు కేసులోని నిందితులందరూ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. బీజేపీ నేతలు ఎల్.కే. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. జస్టిస్ రోహిన్టన్ ఫాలి నారిమన్ సారథ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 19న బాబ్రీ కేసు పై తీర్పును సెప్టెంబర్ 30 వరకూ వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. బాబ్రీ స్థలంలో పురాతన రామాలయం ఉదంటూ 'కరసేవకులు' 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో రామాలయ ఉద్యమానికి సారథ్యం వహించిన వారిలో ఎల్.కె.అడ్వాణీ, ఎం.ఎం.జోషిలు ఉన్నారు. అడ్వాణీ, జోషిలు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు తమ వాంగ్మూల్మం ఇచ్చారు.